చిరు 'లూసీఫర్' లో బాలీవుడ్ కండల వీరుడు?

చిరు లూసీఫర్ లో బాలీవుడ్ కండల వీరుడు?
x
salman khan, chiranjeevi(File Photo)
Highlights

సైరా చిత్రం అనంతరం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.

సైరా చిత్రం అనంతరం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇది చిరంజీవికి 152వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్ కథానాయకగా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా వాయిదా పడింది.

అయితే ఈ లాక్‌డౌన్ సమయంలో ఆచార్య తరవాత చేయబోయే చిత్రాలకి సంబంధించిన కథలను వింటున్నట్టుగా చిరంజీవి తన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే.. . ఈ చిత్రం తర్వాత 'లూసీఫర్' రీమేక్ లో నటిస్తున్నట్టుగా చిరంజీవి వెల్లడించారు. ఈ సినిమాకి 'సాహో' ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్నట్టుగా చిరు స్పష్టం చేశారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నట్లు టాలీవుడ్ సర్కిల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

రాజకీయాల అనంతరం చిరంజీవి మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సమయంలో చిరంజీవి రీ ఎంట్రీ చిత్రంలో వెంకటేష్, సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేయాలని అనుకున్నారట. కానీ ఈ విషయాన్ని సినిమా రిలీజ్ అయిపోయాక చిరుకి తెలిసిందట.. ఈ నేపధ్యంలో తన తదుపరి చిత్రంలో సల్మాన్‌ని నటింపజేయాలని చిరంజీవి కూడా కోరారని తెలుస్తోంది. ఒరిజినల్ 'లూసీఫర్' సినిమాలో చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ ఓ కీలకపాత్రలో నటించారు. అయితే ఈ పాత్రలో సల్మాన్ ని నటించాపజేయాలని చిరంజీవి భావిస్తున్నరట.. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories