సరిలేరు నీకెవ్వరు నుంచి నేడు బిగ్ అనౌన్స్‌మెంట్‌

సరిలేరు నీకెవ్వరు నుంచి నేడు బిగ్ అనౌన్స్‌మెంట్‌
x
Highlights

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు.

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మహేష్ కి జోడిగా రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ సినిమాని దిల్‌ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ప్రమోషన్‌ కార్యక్రమాలు ఇప్పటికే మొదలు పెట్టింది. అందులో భాగంగానే జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఈ రోజు బిగ్‌ అనౌన్స్‌మెంట్ రానుంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తన అధికార ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేస్తూ లాండ్‌ మార్క్‌ అనౌన్స్‌మెంట్‌కు సిద్ధంకండి అంటూ ఓ పోస్ట్ చేశారు. ఈ రోజు సాయంత్రం 5.04 నిమిషాలకు ఆ ప్రకటన ఏంటో వెలువడనుంది. అయితే ఆ బిగ్ అనౌన్స్‌మెంట్‌ ఏంటి అభిమానులు ఆ అప్‌డేట్‌ ఏంటో తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ వచ్చే నెల 5 న ప్రీ రీలిజ్ ఈవెంట్ ని నిర్వహించనుంది. అయితే ఈ ఈవెంట్‌కు రానున్న ముఖ్య అతిథి గురించి ఆ అనౌన్స్‌మెంట్‌ అయి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఈవెంట్ కి రామ్ చరణ్, ఎన్టీఆర్ లు రానున్నారని సమాచారం. గతంలో భరత్‌ అనే నేను వేడుకకు ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. సో ఈ వేడుకకి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందరు భావిస్తున్నారు. కానీ దీనిపైన స్పష్టత రావాల్సి ఉంది.

అంతే కాకుండా సినిమాకి సంబంధించిన టీజర్ గురించి చెప్పనున్నారా అన్న ఆసక్తి కూడా నెలకొంది. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, సంగీత, విజయశాంతి ముఖ్యపాత్రలలో నటించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 11న సంక్రాంతి పండగ కానుకగా విడుదల చేయనున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories