పవన్ కళ్యాణ్ అ సన్నివేశంలో నిజంగానే ఏడ్చాడు : భీమినేని

పవన్ కళ్యాణ్ అ సన్నివేశంలో నిజంగానే ఏడ్చాడు : భీమినేని
x
Highlights

శుభమస్తు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు భీమినేని శ్రీనివాస్ రావు ... అ తరవాత వచ్చినా సుస్వాగతం సినిమాకి ఆయనకి మంచి బ్రేక్ ని ఇచ్చింది . తాజాగా ఓ...

శుభమస్తు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు భీమినేని శ్రీనివాస్ రావు ... అ తరవాత వచ్చినా సుస్వాగతం సినిమాకి ఆయనకి మంచి బ్రేక్ ని ఇచ్చింది . తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నా భీమినేని సుస్వాగతం సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసాడు . సుస్వాగతం సినిమా పవన్ కళ్యాణ్ కి మంచి పేరును తీసుకువచ్చింది . ముఖ్యంగా అ సినిమాలోకి చివరి సన్నివేశంలో అయన చేసిన నటన సినిమాకి హై లైట్ గా చెప్పుకోవచ్చు.

అంతేకాకుండా సినిమాలో రఘువరన్ నటన , ప్రకాష్ రాజ్ మ్యానరిజం సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి . ఇక సినిమాలో చివరి సన్నివేశంలో రఘువరన్ చనిపోయినప్పుడు అతని కొడుకు అయిన పవన్ ఏడుస్తూ నటించాలి కానీ అ సన్నివేశంలో పవన్ నిజంగానే ఎడ్చారని ఒక రోజు అన్నం కూడా తినకుండా ఉన్నారని అయన వెల్లడించాడు . ఈ సినిమా తర్వాత వీరి కాంబినేషన్ లో అన్నవరం సినిమా వచ్చింది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories