మరోసారి ఆ దర్శకుడితో బాలయ్య?

మరోసారి ఆ దర్శకుడితో బాలయ్య?
x
Highlights

గత ఏడాది బాలకృష్ణ రెండు సినిమాలతో ఫ్యాన్స్ ని నిరాశపరిచాడు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు మరియు రూలర్ సినిమాలు విజయాన్ని అందుకోలేకపోయాయి.

గత ఏడాది బాలకృష్ణ రెండు సినిమాలతో ఫ్యాన్స్ ని నిరాశపరిచాడు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు మరియు రూలర్ సినిమాలు విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇప్పుడు బాలకృష్ణకి హిట్టు తప్పనిసరి అయిపొయింది. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ముహూర్తపు సన్నివేశాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

గతంలో బోయపాటి బాలకృష్ణ. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్‌ సినిమాలు మంచి విజయం సాధించటంతో ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిమిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు. క్యాథరిన్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. కానీ ఇంకా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తనకి గతంలో మంచి హిట్లు ఇచ్చిన సీనియర్ దర్శకుడు బి గోపాల్ తో ఓ సినిమాని చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. గతంలో బాలకృష్ణ బి గోపాల్ కాంబినేషన్ లో లారీ డ్రైవర్ , రౌడీ ఇన్‌స్పెక్టర్, సమరసింహా రెడ్డి, నరసింహ నాయడు లాంటి సూపర్‌ హిట్ సినిమాలు వచ్చాయి. చివరగా వీళ్లిద్దరి కాంబినేషన్ లో 'పల్నాటి బ్రహ్మనాయుడు' చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత 'హర హర మహదేవ ' అనే సినిమాని మొదలుపెట్టినప్పటికీ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

ఇక ప్రస్తుతం బి గోపాల్ సినిమాలు అయితే చేయడం లేదు. చివరగా ఆయన గోపీచంద్ హీరోగా ఆరడుగుల బుల్లెట్టు సినిమాకి దర్శకత్వం వహించారు. కానీ సినిమా విడుదల కాలేదు. ఇప్పుడు ఈ సీనియర్‌ డైరెక్టర్‌ బాలయ్య హీరోగా సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఇప్పటికే ఇద్దరి మధ్య కథ చర్చలు కూడా జరిగాయని బాలయ్య కూడా దీనికి ఓకె చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది.

ఇక ఈ సినిమానే కాకుండా ఎప్పటినుంచో బాలకృష్ణ డ్రీం ప్రాజెక్ట్ గా అనుకుంటున్న ఆదిత్య 369కి కూడా సీక్వెల్ కి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనిపైన కథ చర్చలు కూడా ఎప్పుడో పూర్తి అయ్యాయని సెట్స్ వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతునట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా బాలకృష్ణ దర్శకత్వం వహించనున్నారని టాక్.. ఆదిత్య 369కి సింగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories