తిరుమల శ్రీవారిని ఒక్క సెలబ్రిటీల వెళ్ళిన స్పెషల్ దర్శనం ఉంటుంది. ఇక ఓ నలుగురు హీరోయిన్లు కలిసి వెళ్తే ఎలా ఉంటుంది.
సహజంగా తిరుమల శ్రీవారిని ఒక్క సెలబ్రిటీల వెళ్ళిన స్పెషల్ దర్శనం ఉంటుంది. ఇక ఓ నలుగురు హీరోయిన్లు కలిసి వెళ్తే ఎలా ఉంటుంది. కానీ నిన్న (ఆదివారం) అక్కడ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నలుగురు హీరోయిన్లు ఒకేసారి కాలినడక తిరుమలకి వెళ్ళి అక్కడ శ్రీవారిని దర్శించుకున్నారు. తమ సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు.
బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో 'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి' అనే చిత్రం తెరక్కేక్కింది. ఇందులో ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించారు. మే 6 న సినిమా విడుదలకి సిద్దం అవుతుంది. . బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్, పూర్వీ పిక్చర్స్ పతాకాలపై హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్ నిర్మించారు. గోవాలో జరిగిన ఒక ఘటనలో నలుగురు అమ్మాయిలు చిక్కుకొని దాని నుంచి ఎలా బయటపడ్డారన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. కామెడీ, థ్రిల్లింగ్ అంశాలు బాగా ఆకట్టుకుంటాయని ఇప్పటకే దర్శకుడు చెప్పుకొచ్చాడు.
సినిమా విడుదల తేది దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ నలుగురు హీరోయిన్స్ తో కలిసి శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకి వెళ్లారు. శ్రీవారిమెట్టు నుంచి కాలినడక మొదలుపెట్టి వీరంతా తిరుమలకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పుకొచ్చారు. ధన్య అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి పాత్రలో తాను నటించానని, ఇది తన కెరీర్లో చేసిన ఎక్స్పెరిమెంటల్, ఎక్సైటింగ్ సినిమా అవుతుందని ధన్య బాలకృష్ణ చెప్పుకొచ్చింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire