ఎఫ్ 2 తో సంబంధం లేదంటున్న అనిల్

ఎఫ్ 2 తో సంబంధం లేదంటున్న అనిల్
x
Highlights

గత ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ కొట్టాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధానపాత్రల్లో...

గత ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ కొట్టాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. అయితే దీనికి కూడా అనిల్ రావిపూడినే దర్శకత్వం వహిస్తున్నదంటూ రకరకాల వార్తలు వచ్చాయి.

తాజాగా దీనిపైన అనిల్ రావిపూడి స్పందిస్తూ దానికి నాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఆ ప్రాజెక్టుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ప్రస్తుతం ఎఫ్2 సీక్వెల్ గా ఎఫ్3 పైన వర్క్ చేస్తున్నట్టు ప్రకటించాడు అనిల్ .. ఎఫ్2 హిందీ రీమేక్ ని బోనీకపూర్ నిర్మిస్తున్నాడు. తెలుగులో వరుణ్ తేజ్ పోషించిన పాత్రను హిందీలో బోనీకపూర్ కొడుకు అర్జున్ కపూర్ పోషిస్తున్నాడు. అనీస్ బజ్మీ ఈ రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక ఎఫ్2 బాగా హిట్ కావడంతో దీనికి సీక్వెల్ చేయాలనీ చిత్ర యూనిట్ ఎప్పటినుంచో అనుకుంటుంది. తాజాగా హీరో వెంకటేష్ కూడా ఈ సినిమాకి సీక్వెల్ చేస్తున్నామని ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతునట్టు గా చెప్పుకొచ్చాడు. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటు రవితేజ కూడా ఉంటాడని తెలుస్తోంది. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమాని కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజునే నిర్మించనున్నారు.

తాజాగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో మహేష్ బాబు ఆర్మీ రోల్ లో కనిపించారు. మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. విజయశాంతి కీలకపాత్రలో కనిపించారు. సంగీత, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాని అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories