శేఖర్‌ మాస్టర్‌, అనసూయకి ఛాలెంజ్ విసిరిన యాంకర్ రష్మి

Anchor Rashmi Planting trees in Rojavanam by Accepting Green India Challenge
x
Rashmi Gautam(File Photo)
Highlights

తెలంగాణా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి మంచి స్పందన వస్తుంది. సినీ నటుల నుంచి రాజకీయ నాయకుల వరకు

తెలంగాణా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి మంచి స్పందన వస్తుంది. సినీ నటుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరు ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. అంతేకాకుండా మరో ముగ్గురిని మొక్కలు నాటల్సిందిగా కోరుతున్నారు. అయితే దీనిని స్పూర్తిగా తీసుకున్న సినీ నటి, నగిరి ఎమ్మెల్యే రోజా 'రోజా వనం' అనే పేరుతో మొక్కలను నాటుతూ పలువురితో మొక్కలను నాటిస్తున్నారు.. ఇప్పటికే నటుడు అర్జున్, నటి ఖుష్బూల చే మొక్కలు నటించారు రోజా...

తాజాగా జబర్దస్త్ యాంకర్‌ రష్మి గౌతమ్ రోజా విసిరిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కు స్వీకరించి నానక్‌రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో మొక్కలు నాటారు. అలాగే గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను హీరో సత్యదేవ్‌, ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌, తన తోటి యాంకర్‌ అనసూయకు చాలెంజ్‌ విసిరారు. ఈ సందర్భంగా రష్మి మాట్లాడుతూ.. "రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుంది కాబట్టి వాతావరణంలో హెచ్చుతగ్గులను సమతుల్యం చేసేందుకు మొక్కలను నాటాలి. ఆ భాద్యత మనపైన ఎంతైనా ఉంది.

సినిమాలో చిన్నచిన్న క్యారెక్టర్ లతో కెరీర్ ని ప్రారంభించిన రష్మీ హోలీ సినిమాతో వెండితెరకి పరిచయం అయింది. సుశాంత్ హీరోగా చేసిన కరెంట్ సినిమా ఆమెకి మంచి పేరును తీసుకువచ్చింది. ఇక గుంటూరు టాకీస్, చారుశీల సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం ఎక్సా ట్రా జబర్దస్త్, ఢీ షోలలో యాంకర్ గా రాణిస్తుంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories