womens day : రష్మి సంచలన ట్వీట్

womens day : రష్మి సంచలన ట్వీట్
x
Rashmi gautam
Highlights

బుల్లితెర పైన మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా కనిపిస్తూ సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటుంది జబరస్త్ యాంకర్ రష్మి..

బుల్లితెర పైన మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా కనిపిస్తూ సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటుంది జబరస్త్ యాంకర్ రష్మి.. నేడు (ఆదివారం) (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ట్విటర్‌ వేదికగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మొదటగా "మమ్మల్ని సూపర్‌ ఉమెన్‌ చేయడం ఆపండి" అని ఓ ఫొటోను షేర్‌ చేసిన రష్మీ ఆ తర్వాత "ఓ మహిళ 8 ఏళ్ల నుంచి న్యాయం కోసం ఎదురుచూస్తున్న దేశంలో.. మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. హ్యాపీ ఉమెన్స్‌ డే" అంటూ వ్యంగ్యంగా స్పందించింది.. ఆ ట్వీట్ కి నిర్భయ తల్లి ఆశాదేవి కన్నీరు పెడుతున్న ఫొటోను జత చేసింది రష్మి..

అంతేకాకుండా రష్మీ చేసిన మరో ట్వీట్ కూడా వైరల్ గా మారింది. హోలీ వస్తుంది కాబట్టి దయచేసి కుక్కలపై రంగులు వేయకండి.. హోలీలో మనపై రంగులు పడితే వాటిని శుభ్రం చేసుకునేందుకు మనకు సబ్బులు ఉన్నాయి. కానీ మూగజీవాలకి అలాంటివేవి ఉండవంటూ రష్మీ ట్వీట్ చేసింది. అయితే రష్మీ చేసిన ఈ ట్వీట్ పైన ఓ నెటిజన్ స్పందిస్తూ.. పండగలు, పబ్బాలు వచ్చినప్పుడే మీకు ఇలాంటివి గుర్తుకు వస్తుంటాయా ? అని ప్రశ్నించింది. దీనిపైన రష్మీ స్పందిస్తూ.. "నాపై ఇలాంటి పోస్టులు పెట్టే ముందు ఒకసారి నేను గతంలో చేసిన పోస్టుల్ని నా పేజ్‌ను చెక్ చేయండి" అంటూ కౌంటర్ వేసింది.

ఇక సినిమాలో చిన్నచిన్న క్యారెక్టర్ లతో కెరీర్ ని ప్రారంభించిన రష్మీ హోలీ సినిమాతో వెండితెరకి పరిచయం అయింది. సుశాంత్ హీరోగా చేసిన కరెంట్ సినిమా ఆమెకి మంచి పేరును తీసుకువచ్చింది. ఇక ఆ తర్వాత గుంటూరు టాకీస్, చారుశీల సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం ఎక్సా ట్రా జబర్దస్త్, ఢీ షోలలో యాంకర్ గా రాణిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories