ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి 'శిరిడి సాయి' నిర్మాత కోటి రూపాయల విరాళం

ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి శిరిడి సాయి నిర్మాత కోటి రూపాయల విరాళం
x
AMR Group Chairman Mahesh Reddy, YS Jagan
Highlights

కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వాలు చేస్తున్న ఈ పోరాటానికి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ముందుకు వచ్చి తమ వంతుగా ఆర్ధిక సహాయం అందిస్తున్నారు.

కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వాలు చేస్తున్న ఈ పోరాటానికి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ముందుకు వచ్చి తమ వంతుగా ఆర్ధిక సహాయం అందిస్తున్నారు.ఇప్పటికే చాలా మంది ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహాయనిధులకి భారీగా విరాళాలను అందజేస్తున్నారు.

తాజాగా కరోనా వైరస్ బాధితుల సహాయార్థం కోసం ప్రముఖ నిర్మాత మరియు ఏఎమ్ఆర్ గ్రూప్ చైర్మన్ 'మహేష్ రెడ్డి' ఎపి సిఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.. ఈ మేరకు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చెక్కును అందచేసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఆయనను అభినందించారు.. ఇక అంతకుముందు మహేష్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి కోటి రూపాయల విరాళాన్ని అందజేశారు. అక్కినేని నాగార్జునతో శిరిడి సాయి, ఓం నమో వేంకటేశాయ వంటి భక్తి రస చిత్రాలను నిర్మించారు మహేష్ రెడ్డి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories