అల్లు అర్జున్‌ కుటుంబంలో విషాదం

అల్లు అర్జున్‌ కుటుంబంలో విషాదం
x
అల్లు అర్జున్ (ఫైల్ ఫోటో)
Highlights

స్టైలిష్ స్టార్ అల్లు మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ గుండెపోటుతో బుధవారం విజయవాడలో మృతి చెందారు.

ఇటీవల రిలీజ్ ఐన అల వైకుంఠపురం సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్, అల్లు ఫ్యామిలీ సంబరాల్లో మునిగిపోయారు. సరిగ్గా ఇదే సమయంలో అల్లు వారింట విషాదం నెలకొంది. స్టైలిష్ స్టార్ అల్లు మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ గుండెపోటుతో బుధవారం విజయవాడలో మృతి చెందారు. అల్లు అర్జున్ తల్లి నిర్మలాదేవికి ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ స్వయానా అన్నయ్య. బన్నీకి పెద్ద మేనమామయ్మ.

బన్నీ చిన్నప్పటి నుంచి కూడా ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ప్రతి విషయాన్ని ఆయనతో డిస్కర్షన్ చేసేవారు. బన్నీ ఇంట ఏ సంబరాలు జరగినా ఆయనే ముందుండేవారు. ప్రతి పండగలకు అల్లు ఫ్యామిలీ అంతా తన మావయ్య ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేసే వారు. ఇంత సన్నిహితంగా ఉన్న ప్రసాద్ చనిపోయారనే వార్త తెలియడంతో అల్లు ఫ్యామిలీ షాక్ గురైంది. ఈయన మృతితో ఒక్క సారిగా విషాదం అలుముకుంది. ఈ విషాద వార్త తెలుసుకున్న వెంటనే అల్లు కుటుంబం మొత్తం విజయవాడకు చేరుకుంది.

ఇక పోతే సుకుమార్, బన్నీ కాంబినేషన్‌లో బన్ని 20 సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి బన్ని మేనమామ సహ నిర్మాతగా పనిచేస్తూ సినీ రంగంలో ప్రవేశించారు. ఇది బన్ని 20వ సినిమా కావడంతో భారీ అంచనాలతో ఈ సినిమాని ప్లాన్ చేసారు. ఈ ప్రాజెక్ట్‌లో ఆయన కూడా భాగస్వామి అయ్యారు. చిత్ర ప్రారంభోత్సవంలోనూ పాల్గొన్న ఆయన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకాకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ప్రసాద్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories