Allu Arjun : 'అల వైకుంఠపురములో' క్లోజింగ్ కలెక్షన్స్

Allu Arjun : అల వైకుంఠపురములో క్లోజింగ్ కలెక్షన్స్
x
Ala vaikunthapurramuloo Movie poster
Highlights

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్ నుంచి వచ్చిన చిత్రం 'అల.. వైకుంఠపురములో' .

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్ నుంచి వచ్చిన చిత్రం 'అల.. వైకుంఠపురములో' .. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సినిమా విడుదలకి ముందు తమన్ పాటలు , త్రివిక్రమ్ టేకింగ్ , అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ , పూజా అందాలు ఇలా వేటికవే హైలెట్ గా నిలుస్తూ సినిమాని బిగ్గెస్ట్ హిట్ గా నిలిపాయి. ఈ సినిమాకి పోటిగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు కూడా మంచి పోటి ఇచ్చినప్పటికీ సినిమా మంచి వసూళ్ళను సాధించింది.. కొన్ని చోట్లల్లో నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. తాజాగా ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసింది.

ఫుల్ రన్ ముగిసేసరికి 'అల వైకుంఠపురములో' కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి..

నైజాం 44.88 cr

♦ సీడెడ్ 18.27 cr

♦ ఉత్తరాంధ్ర 19.93 cr

♦ ఈస్ట్ 11.44 cr

♦ వెస్ట్ 8.96 cr

♦ కృష్ణా 10.79 cr

♦ గుంటూరు 11.18 cr

♦ నెల్లూరు 4.72 cr

♦ రెస్ట్ ఆఫ్ ఇండియా 11.85 cr

♦ ఓవర్సీస్ 18.35 cr

♦ వరల్డ్ వైడ్ టోటల్ 160.37 cr (share)

ఈ సినిమా విడుదలకి ముందు 85 కోట్ల బిజినెస్ జరిగిందని టాక్.. ఇక విడుదలైన 6 రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డులను తిరగరాస్తూ ముందుకు వెళ్ళింది.. ఫుల్ రన్ ముగిసేసరికి తెలుగు రాష్ట్రాల్లో.. 130.17 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక.. వరల్డ్ వైడ్ గా మొత్తం ..160.37 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకూ 256.36 కోట్లను కొల్లగొట్టింది.. భారీ కలెక్షన్లను కొల్లగొట్టి ఇటు తెలుగు సినిమా స్థాయిని త్రివిక్రమ్ , అల్లు అర్జున్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ని మరోసారి చాటి చెప్పింది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హేగ్దే కథానాయకగా నటించింది. రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, నివేతా పెతురాజ్, సుశాంత్ , తనికెళ్ళ భరణి మొదలగువారు కీలక పాత్రల్లో మేరిశారు. ఈ సినిమాని అల్లు అరవింద్‌, రాధకృష్ణలు సంయుక్తంగా గీతాఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఆర్య, ఆర్య 2 లాంటి సినిమాల తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories