'అల'... రికార్డుల మోత అగడంలేదు..

అల... రికార్డుల మోత అగడంలేదు..
x
Highlights

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తాజాగా వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురములో' .. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తాజాగా వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురములో' .. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. పలుచోట్లల్లో నాన్ బాహుబలి రికార్డులను సైతం కొల్లగొట్టింది ఈ సినిమా..తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లోని పాటలు సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాలోని పాటలు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాయనే చెప్పాలి.

ముఖ్యంగా సామజవరగమన, బుట్ట బొమ్మ, రాములో రాముల వంటి పాటలు రీపీట్ గా మోగుతూ పెద్ద హిట్టైయ్యాయి. ఇక బుట్ట బొమ్మ పాటకు అల్లు అర్జున్ వేసిన స్టైలిష్ స్టెప్పులు అదరగొట్టాయి. థియేటర్లలో ప్రేక్షకులతో స్టెప్పులు వేయించింది. నెల రోజుల క్రతం ఈ సినిమాకు సంబంధించిన 'బుట్ట బొమ్మ' ఫుల్ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేసారు. ఈ పాట ఇప్పటికీ టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. నెల రోజుల్లోనే 'బుట్ట బొమ్మ సాంగ్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ దక్కించుకొని రికార్డు సృష్టించింది. అంటే ఏకంగా పది కోట్ల మంది ఈ పాటను చూశారన్న మాట. ఈ వీడియో సాంగ్స్ లైక్స్ కూడా వన్ మిలియన్ కి చేరుకోవడం మరో విశేషం.

ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు అల్లు అర్జున్.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది అల్లు అర్జున్ కి 20 వ సినిమా కావడం విశేషం..ఇక ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ లుక్ లో కనిపించనున్నాడని, గంధపు చెక్కలు, స్మగ్లింగ్ నేపధ్యంలో ఈ సినిమా ఉంటుందని ప్రచారం సాగుతుంది. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాని దసరాకి బరిలోకి దింపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఆర్య, ఆర్య2 సినిమాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్ రీపీట్ అవుతుండడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories