ఈ ఏడాది సంక్రాంతికి అల వైకుంఠపురములో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.
ఈ ఏడాది సంక్రాంతికి అల వైకుంఠపురములో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు అల్లు అర్జున్.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది అల్లు అర్జున్ కి 20 వ సినిమా కావడం విశేషం..
ఇప్పటికే షూటింగ్ మొదలైనప్పటికి ఈ సినిమా కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడింది. అయితే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఒక సర్ప్రైజ్ రాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ''ఏమబ్బా, అందరూ బాగుండారా.. మీరు ఎప్పుడెప్పుడా అని చూస్తాండే AA20 అప్డేట్ ఏప్రిల్ 8న, తెల్లార్తో 9 గంటలకు వస్తాండాది.. రెడీ కాండబ్బా" అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ లో చిత్ర నిర్మాణ సంస్థ రాయలసీమ యాసని వాడింది.
అయితే ఇందులో అల్లు అర్జున్ రాయలసీమ భాషలో మాట్లాడనున్నాడని అర్ధం అవుతుంది. ఇక ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ లుక్ లో కనిపించనున్నాడని, గంధపు చెక్కలు, స్మగ్లింగ్ నేపధ్యంలో ఈ సినిమా ఉంటుందని ప్రచారం సాగుతుంది. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాని దసరాకి బరిలోకి దింపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఆర్య, ఆర్య2 సినిమాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్ రీపీట్ అవుతుండడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.
#AA20Update on 8th April at 9 AM 💥
— Mythri Movie Makers (@MythriOfficial) April 6, 2020
Inka chusko naa saamii 🤘🤘@alluarjun @aryasukku @ThisIsDSP #AA20 pic.twitter.com/ixqlaQhtoy
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire