బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్ మధ్య లవ్ బ్రేకప్ అయిందని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్ మధ్య లవ్ బ్రేకప్ అయిందని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారని మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరూ 'బ్రహ్మస్త్ర' అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి వీరిద్దరూ కలిసి తరచూ పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లి వస్తున్నారు. దీంతో రణ్బీర్-ఆలియా ప్రేమలో ఉన్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇక కరోనా వైరస్ ప్రభావం వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇక తాజాగా మార్చి 15న ఆలియా భట్ పుట్టిన రోజు జరిగిన విషయం తెలిసిందే.
అయితే ఈ వేడుకల్లో రణభీర్కపూర్ కనిపించకపోవడంతో పాటు ఆమెకు శుభాకాంక్షలు తెలుపకపోవడంతో ఇద్దరి మధ్య బ్రేకప్ ఆయన వార్తలు నిజమేనంటూ అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఆలియా భట్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇన్స్టా వేదికగా తనకు సంబంధించిన ఓ ఫొటోను అభిమానులతో షేర్ చేసుకుంటూ.. ఆ ఫొటో రణ్బీర్ తీశాడని పేర్కొంది. 'ఇంట్లో ఉన్నాను. సంధ్యా సమయాన్ని వీక్షిస్తున్నాను. ఈ ఫొటో క్రెడిట్.. నా ఆల్టైం అభిమాన ఫొటోగ్రాఫర్ ఆర్కే(రణ్బీర్ కపూర్)' అని ఆమె పేర్కొంది. దీంతో వీరిద్దరి మధ్య బ్రేకప్ అయ్యిందని వస్తున్న వార్తలకు చెప్పినట్లయింది.
View this post on InstagramA post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on
RRR లో అలియా భట్:
బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ( వర్కింగ్ టైటిల్ మాత్రమే ).. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.
దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని,శ్రియ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు. ముందుగా సినిమాని ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటిచింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వలన సినిమాని వచ్చే ఏడాది 2021 జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire