బాహుబలి రికార్డులను దాటేయనున్న బన్ని

బాహుబలి రికార్డులను దాటేయనున్న బన్ని
x
Highlights

అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'అల.. వైకుంఠపురములో'..

అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'అల.. వైకుంఠపురములో'.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్,గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అల్లు అర్జున్ సరసన పూజా హేగ్దే కథానాయకగా నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని త్రివిక్రమ్,బన్ని కాంబినేషన్ లో హ్యట్రిక్ మూవీగా నిలిచింది.

సంక్రాంతికి రిలీజై 155 కోట్ల షేర్ బద్దలు కొట్టి అల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా నైజాం, ఓవర్సీస్, కర్ణాటకలో తప్ప మిగిలిన అన్ని చోట్లలో ఇప్పటికే బాహుబలి ఫస్ట్ పార్ట్ కలెక్షన్లును దాటేసింది. ఇక ఈ ఆదివారం నైజాంలోనూ, ఓవర్సీస్ లోనూ బాహుబలి మొదటి పార్ట్ కలెక్షన్లను దాటేసి రేర్ ఫీట్ ని అందుకోనుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హిందీ వర్షన్ లేకపోయినప్పటికీ రెండు వందల కోట్లును కలెక్ట్ చేసిన సినిమాగా అల.. వైకుంఠపురములో రికార్డు సృష్టించిందని చెప్పాలి.

ఇక సినిమా మంచి సక్సెస్ కావడంతో ఇప్పటికే చిత్ర యూనిట్ శుక్రవారం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన థాంక్స్ మీట్ లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను షీల్డులతో సత్కరించారు. అంతేకాకుండా మొత్తం ఇండస్ట్రీకి ఆదివారం (ఫిబ్రవరి 02) న అల్లు వారి ఇంట్లో గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నారు. సెలబ్రేషన్స్ లో ఎక్కడ కూడా తగ్గేది లేదని అల్లు అర్జున్ ఇప్పటికే చెప్పుకొచ్చాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories