అల్లు అర్జున్ కథానాయకుడుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అల వైకుంఠపురములో' ..
అల్లు అర్జున్ కథానాయకుడుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అల వైకుంఠపురములో' .. ఈ చిత్ర టీజర్ వాయిదా వేస్తునట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ప్రకటించింది. తమ కుటుంబసభ్యుడిగా భావించే ఓ అభిమాని మృతి చెందడడంతో టీజర్ను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. 'మా కుటుంబసభ్యుల్లో ఒకరిగా భావించే ఓ అభిమాని మృతి చెందారు. నూర్ బాయ్ మా అందరికీ ఓ కుటుంబ సభ్యుడు లాంటి వ్యక్తి. ఇలాంటి ఉహించని పరిణామాల వల్ల సినిమాకు సంబంధించి విశేషాలను తెలియచేయడానికి ఇది సరైన సమయం కాదని భావిస్తున్నాం' త్వరలోనే సినిమా టిజర్ ని ప్రకటిస్తామని చెప్పుకొచ్చింది..
జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత బన్ని, త్రివిక్రమ్ చేస్తున్న సినిమా కావడంతో సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. పూజా హెగ్దే కథానాయకగా నటిస్తున్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హానిని క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు ఆరవింద్, రాధాక్ళష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సినిమా పాటలు సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Demise of a fan is like losing an extended family member. Noor Bhai was like family to all of us. Due to unforeseen circumstances, we don't feel that this is the time for any fancy announcements. We will surely update details about #AlaVaikunthapurramulooTeaser soon. #RIPNoorBhai
— Geetha Arts (@GeethaArts) December 8, 2019
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire