అల వైకుంఠపురంలో కథ ఇదేనా ? సోషల్ మీడియా లో వైరల్

అల వైకుంఠపురంలో కథ ఇదేనా ? సోషల్ మీడియా లో వైరల్
x
Highlights

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురంలో... ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు రంగం సిద్దం...

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురంలో... ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు . ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు . దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది . అయితే తాజాగా ఈ సినిమా కథ ఇదేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే...

అల వైకుంఠపురంలో అనే ఇంట్లో రెండు కుటుంబాలు ఉంటాయి . అందులో ఒకటి యజమాని కుటుంబం కాగా మరొకటి డ్రైవర్ కుటుంబం. కానీ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉంటారు. ఇద్దరికీ ఒకేసారి మగపిల్లలు పుడతారు . అందులో ఒకరు యజమాని కొడుకు అల్లు అర్జున్ కాగా , డ్రైవర్ కొడుకు సుశాంత్ ... కానీ వీరి భవిషత్తుపై చర్చ వచ్చినప్పుడు మాత్రం డ్రైవర్ మాట్లడుతూ డ్రైవర్ కొడుకు డ్రైవర్ అవుతాడు . ధనవంతుడి కొడుకు ధనవంతుడే అవుతాడని అంటాడు. ఈ క్రమంలో ఇద్దరు మధ్య మాట మాట వచ్చి ఒకరి కొడుకులను మార్చుకొని పెంచుతూ ఉంటారు. మధ్యలో నవదీప్ ఎంట్రీ ఇచ్చి అసలు కథకి ముంగిపు ఇస్తాడు . ఈ విషయం తెలుసుకున్నా సుశాంత్ - అల్లు అర్జున్ ఎం చేసారు అన్నది మిగిలిన కథ అని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది .

మరి ఇదే కాన్సెప్ట్ తోనే త్రివిక్రమ్ సినిమాని తీస్తున్నడా? లేదా అన్నది తేలాల్సి ఉంది . ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా పూజా హేగ్దే హీరోయిన్ హా నటిస్తుంది . ఎస్ రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా సినిమాని తెరకెక్కిస్తున్నారు . ధమన్ సంగీతం అందిస్తున్నాడు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories