ఒకపక్క కరోనా వైరస్ గురించి అందరు భయపడుతుంటే బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ మాత్రం లండన్ నుంచి కరోనానీ వెంట తెచ్చి పెట్టుకుంది.
ఒకపక్క కరోనా వైరస్ గురించి అందరు భయపడుతుంటే బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ మాత్రం లండన్ నుంచి కరోనానీ వెంట తెచ్చి పెట్టుకుంది.. లండన్ నుంచి వచ్చిన ఆమె ఎయిర్ పోర్ట్ లో తన ట్రావెల్ హిస్టరీ దాచిపెట్టి ఫ్యామిలీ పార్టీలో హాజరైంది. తాజాగా ఉత్తర ప్రదేశ్ లక్నోలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా అందులో నలుగురికి వైరస్ లక్షణాలు ఉన్నట్టుగా తేలింది.
అందులో కనికా కపూర్ ఒకరు కావడంతో సినీ ఇండస్ట్రీలో ఆందోళనలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నటి పూనమ్ కౌర్ దీనిపైన స్పందిస్తూ.. ఎంత డబ్బు పలుకుబడి ఉంటే మాత్రం ఇలా బాధ్యత లేకుండా చేస్తారా? సమాజానికి మంచి చేయడం అనేది మన మొదటి బాధ్యత.. కనికా కపూర్ ఓ క్రిమినల్ అంటూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇంకా కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తుంది. ఇప్పటికే భారత్ లో 180 కి పైగా కేసులు నమోదయ్యాయి. 5 మరణాలు సంభవించాయి. దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కనికా కపూర్ కరోనా టెస్టులు చేయించుకోకుండా ఫ్యామిలీ పార్టీ లో పాల్గొనడంతో ఆమెపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆమెకి భారీ శిక్షతో పాటు జరిమానా విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
Taking responsibility is a choice that we make ... escaping into comforts ,thinking high about oneself coz of fame ,thinking oneself powerful coz one has money,power is in being responsible in the place n position that we are in to do better for society #KanikaKapoor #criminal 🤢
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) March 20, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire