వేదిక‌పై క‌న్నీరు పెట్టుకున్న యాసిడ్ బాధితురాలు..ఓదార్చిన దీపిక‌

వేదిక‌పై క‌న్నీరు పెట్టుకున్న యాసిడ్ బాధితురాలు..ఓదార్చిన దీపిక‌
x
దీపిక‌
Highlights

ఛ‌పాక్ సినిమా ఆడియో లాంచ్‌ కార్యక్రమంలో యాసిడ్ బాధితురాలు లక్ష్మీ, హీరోయిన్ దీపికా పదుకొనే భావోద్వేగానికి గురయ్యారు. స్టేజీపై ఉన్న లక్ష్మీ చాలా...

ఛ‌పాక్ సినిమా ఆడియో లాంచ్‌ కార్యక్రమంలో యాసిడ్ బాధితురాలు లక్ష్మీ, హీరోయిన్ దీపికా పదుకొనే భావోద్వేగానికి గురయ్యారు. స్టేజీపై ఉన్న లక్ష్మీ చాలా ఎమోష‌న్ అయి క‌న్నీరు పెట్టుకుంటే, దీపిక ఆమెను అక్కున చేర్చుకుని ఓదార్చారు. దీపిక కూడా కన్నీటి పర్యంతమయ్యారు.

యాసిడ్ బాధితురాలు ల‌క్ష్మీ అగ‌ర్వాల్‌ జీవిత నేప‌థ్యంలో మేఘ‌నా గుల్జార్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ఛ‌పాక్. దీపికా ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానుంది. ముంబైలో ఆడియో లాంచ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీపికతో పాటు లక్ష్మీ అగర్వాల్‌ కూడా పాల్గొన్నారు. ప్రముఖ సింగర్‌ శంకర్‌ మహదేవన్‌ ఈ చిత్రంలోని పాట పాడుతుండగా స్టేజీపై ఉన్న లక్ష్మీ చాలా ఎమోష‌న్ అయి క‌న్నీరు పెట్టుకుంది. దీంతో పక్కనే ఉన్న దీపిక ఆమెను అక్కున చేర్చుకుని ఓదార్చారు. ఒకానొక సంద‌ర్భంలో దీపిక కూడా కన్నీటి పర్యంతమయ్యారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories