వేణుమాధవ్ అంత్యక్రియలకు మంత్రి రూ.2లక్షలు సాయం

వేణుమాధవ్ అంత్యక్రియలకు మంత్రి రూ.2లక్షలు సాయం
x
Highlights

వేణుమాధవ్‌ మృతి పట్ల పలువురు సినీ రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ వేణుమాధవ్‌ భౌతిక...

వేణుమాధవ్‌ మృతి పట్ల పలువురు సినీ రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ వేణుమాధవ్‌ భౌతిక కాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. మొదటి నుంచి వేణు మాధవ్ పడిన కష్టాలు తనకు తెలుసని తలసాని చెప్పారు. ఇద్దరు పిల్లలను చూస్తూ వేణు మాధవ్ సంతోష పడేవారని, ఆయన మృతి బాధాకరమని అన్నారు. భగవంతుడు వేణు మాధవ్ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ మేరకు వేణు మాధవ్ మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అలాగే వేణు మాధవ్ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories