టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే..

టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే..
x
Highlights

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ రణరంగం రసవత్తరంగా మారుతోంది. ఇటు అధికార, ప్రతిక్ష పార్టీలలో జోరుగా వలసలు బాట పడుతున్నారు. తాజాగా కర్నూలు...

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ రణరంగం రసవత్తరంగా మారుతోంది. ఇటు అధికార, ప్రతిక్ష పార్టీలలో జోరుగా వలసలు బాట పడుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే చరితారెడ్డి గత కొంతకాలంగా వైసీపీ అధిష్టానం మీద అసంతృప్తితో ఉన్న గౌరు దంపతులు నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి చేరారు. అయితే ఇటీవల బీజేపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి పాణ్యం టికెట్‌ను ఖరారయ్యిందని జోరుగా ప్రచారం ఉంది. గౌరు దంపతులు జగన్‌ను కలిసినా ఎలాంటి హామీ లభించలేదు. ఇక దీంతో చేసేది ఏమీలేక ఈ నెల 1న వైసీపీకి గౌరు దంపతులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories