యామినీకి అంత సీన్‌ లేదు : తాడి శకుంతల

యామినీకి అంత సీన్‌ లేదు : తాడి శకుంతల
x
Highlights

తాజాగా వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ అధికార ప్రతినిధి యామినీ సాధినేని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. జగన్ ఓ అవినీతి రాక్షసుడని...

తాజాగా వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ అధికార ప్రతినిధి యామినీ సాధినేని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. జగన్ ఓ అవినీతి రాక్షసుడని అలాంటి వ్యక్తికి అధికార పగ్గాలు అప్పగించడమంటే అవినీతి తాండవం చేయాలని కోరుకోవడమేనని వ్యాఖ్యలు చేసిన యామినీ పై వైసీపీ నేత, విజయవాడ మాజీ మేయర్‌ తాడి శకుంతల విరుచుకుపడ్డారు. జగన్‌, ఆయన కుటుంబంపై విమర్శలు చేసే స్థాయి యామినీకి లేదని మండిపడ్డారు. యామినీ స్థాయి మరిచి మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబాన్ని ప్రశ్నించే అర్హత తనకు లేదన్నారు. తేడా నేతలు అంటే నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. వైఎస్ కుటుంబం రాష్ట్ర ప్రజలతో ఎలా మమేకం అయ్యారో చరిత్ర చూసి తెలుసుకోవాలి అని హితవు పలికారు.

Show Full Article
Print Article
Next Story
More Stories