130 స్థానాల్లో విజయం సాధిస్తాం: తమ్మినేని

130 స్థానాల్లో విజయం సాధిస్తాం: తమ్మినేని
x
Highlights

ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై నిమిష నిమిషానికి తీవ్ర ఉత్కంఠ పెరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్ పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో విజయం...

ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై నిమిష నిమిషానికి తీవ్ర ఉత్కంఠ పెరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్ పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో విజయం తమదే అంటూ వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రజలు వైసీపీకే అధికారం కట్టబెట్టేందుకు ఫిక్స్ అయ్యారని వైసీపీ నేత తమ్మినేని సీతారాం చెప్పారు. జాతీయ సంస్థలు చేసిన సర్వేలన్నీ వైసీపీ అధికారంలోకి వస్తాయని చెప్తుంటే మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి వంటి కొన్ని ప్రాంతీయ సంస్థలు ప్రజలను కన్ఫ్యూజన్ చేయాలని చూస్తున్నారని తమ్మినేని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీ ఫలితాల్లో 130 స్థానాల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేస్తుందని తమ్మినేని అన్నారు. గత ఐదేండ్ల పాలనలో ఏపీ ప్రజలు టీడీపీ పాలనపై విసుగుచెందారని అన్నారు. ఏపీలో మార్పుకోసం ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఓటమి భయం కళ్లెదురుగా కనబడుతోందని అన్నారు. మే 23 ఫలితాల అనంతరం టీడీపీ ప్యాకప్ అవ్వబోతోందని తమ్మినేని సీతారాం ఎద్దేవా చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories