ఫ్యాన్ అసెంబ్లీలో.. సైకిల్ స్టాండులో.. గ్లాసు క్యాంటీన్‌లో: పృథ్వీ

ఫ్యాన్ అసెంబ్లీలో.. సైకిల్ స్టాండులో.. గ్లాసు క్యాంటీన్‌లో:  పృథ్వీ
x
Highlights

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీని భూస్థాపితం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కంకణం కట్టుకున్నరని వైసీపీ నేత, నటుడు పృథ్వీ అన్నారు....

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీని భూస్థాపితం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కంకణం కట్టుకున్నరని వైసీపీ నేత, నటుడు పృథ్వీ అన్నారు. భీమవరంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజుతో కలిసి పృథ్వీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రఘురామ కృష్ణంరాజుపై దాడి అమానుషం అని తీవ్రంగా ఖండించారు. నాగబాబు, పవన్‌లు మాట్లాడే భాష సరికాదన్నారు. నటన వేరు రాజకీయం వేరు అన్నారు.

ఏపీలో జగన్ సీఎం కావాలని రాజన్న రాజ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బాబు సీఎంగా అనర్హుడని పృథ్వీ మండిపడ్డారు. నారా చంద్రబాబు నాయుడు జీవితమంతా కాపీనే అని ఎద్దేవా చేశారు. దానికి ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టోనే నిదర్శనమన్నారు. ఇన్ని రోజులుగా బాబు మేనిఫెస్టో ప్రవేశ పెట్టకుండా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన తరువాత దాన్ని మార్పు చేసి చంద్రబాబు తమ ప్రవేశ పెట్టడమే దానికి నిదర్శనమన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్‌గా మారారని నిప్పులు చెరిగారు. ముస్లిం ఓట్ల కోసం ఫరూక్ అబ్దుల్లాని రాష్ట్రానికి తీసుకు వచ్చారని మండిపడ్డారు. ఫ్యాన్ అసెంబ్లీలో, సైకిల్ స్టాండులో, గ్లాసు క్యాంటీన్‌లో ఉంటుందని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories