చంద్రబాబుపై దేశద్రోహం కేసు పెట్టాలి-పార్థసారధి

చంద్రబాబుపై దేశద్రోహం కేసు పెట్టాలి-పార్థసారధి
x
Highlights

ప్రజాస్వామాన్ని చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారని వైసీపీ సీనియర్‌ నేత పార్థసారధి ఆరోపించారు. హెచ్ఎంటీవీతో మాట్లాడిన పార్థసారధి డేటా చౌర్యం రాజద్రోహం...

ప్రజాస్వామాన్ని చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారని వైసీపీ సీనియర్‌ నేత పార్థసారధి ఆరోపించారు. హెచ్ఎంటీవీతో మాట్లాడిన పార్థసారధి డేటా చౌర్యం రాజద్రోహం కిందకు వస్తుందని, చంద్రబాబుపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కోరారు. ఐటీ పరిజ్ఞానాన్ని చంద్రబాబు, లోకేష్‌‌ కుట్రల కోసం వాడుకుంటున్నారని, తప్పు చేయ్యకపోతే విచారణకు ఎందుకు భయపడుతున్నారని పార్థసారధి ప్రశ్నించారు. ప్రజల డేటాను తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు వాడుకుంటున్నారంటురని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు తీరు దొంగే.. దొంగ అన్నట్లుగా ఉందని పార్థసారధి ఎద్దేవా చేశారు. అభివృద్ధిని అడ్డుపెట్టుకుని డేటా చోరీ చేయటం దురదృష్టకరమన్నారు. బాబు తన అనుభవంతో లక్షల కోట్లు లూటీ చేయడానికి ప్రయత్నించారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories