టీడీపీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

టీడీపీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు
x
Highlights

ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకరిపై మరోకరు దుమ్మెత్తిపొసుకుంటున్నారు. కాగా ఈ నేపథ్యంలో ఎన్నికలకు నాలుగు...

ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకరిపై మరోకరు దుమ్మెత్తిపొసుకుంటున్నారు. కాగా ఈ నేపథ్యంలో ఎన్నికలకు నాలుగు నెలల ముందు నుండి టీడీపీ సర్కార్ ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలను కేవలం ఓటర్లను ప్రభావితం చేసే విధంగా టీడీపీ సర్కార్ ప్రచారం చేసుకుంటోందని వైసీపీ పార్టీ గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది. ఇలా చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో ఎంవీఎస్‌ నాగిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రకటనలు, వీడియోల ద్వారా ప్రచారం చేసుకోవడం ఎన్నికల నియమాలు ఉల్లంఘించడమేనని కేవలం ఓటర్లను తప్పుదోవ పట్టించడమేనని వివరించారు. ఎన్నికల నిభందనలకు విరుద్దంగా ఉన్న పెయిడ్‌ ఆర్టికల్స్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీకి నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories