వైసీపీలో పాల్ గుర్తు చిచ్చు..ఈసీకి వైసీపీ ఫిర్యాదు

వైసీపీలో పాల్ గుర్తు చిచ్చు..ఈసీకి వైసీపీ ఫిర్యాదు
x
Highlights

ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎన్నికలు...

ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని విజయసాయిరెడ్డి కోరారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పోలీసుల ద్వారా డబ్బులు తరలిస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఏపీ డీజీపీ, ఇంటెలిజెన్స్‌ డీజీలపై చర్యలు తీసుకోవాలని సీఈసీకి విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రజాశాంతి సింబల్ హెలికాప్టర్ రెక్కలు, వైసీపీ పార్టీ గుర్తు ఫ్యాన్‌తో పోలి ఉందని, ఆ గుర్తును మార్చాలంటూ వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. ప్రజాశాంతి పార్టీ కండువా కూడా తమ పార్టీలా మూడు రంగులు క‌లిగి ఉంద‌ని గుర్తు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబాబుతో కలిసి కేఏపాల్ భారీ మోసానికి పాల్పడుతున్నారని పాల్పడుతున్నార‌ని విజయసాయి రెడ్డి ధ్వజ‌మెత్తారు. కేఏ పాల్ ఓ జోకర్, బ్రోకర్ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు విజయసాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories