జయంతి వర్ధంతికి తేడా తెలియని వ్యక్తికి మూడు మంత్రి పదవులు: షర్మిల

జయంతి వర్ధంతికి తేడా తెలియని వ్యక్తికి మూడు మంత్రి పదవులు: షర్మిల
x
Highlights

తన స్వార్థ రాజకీయ లబ్ధి కోసం ఏపీ ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టారని వైసీపీ నాయకురాలు షర్మిల విమర్శించారు. కృష్ణా జిల్లాలో ఎన్నికల...

తన స్వార్థ రాజకీయ లబ్ధి కోసం ఏపీ ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టారని వైసీపీ నాయకురాలు షర్మిల విమర్శించారు. కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించిన ఆమె చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఏపీకి ఊపిరి లాంటి ప్రత్యేక హోదాను నీరుకార్చడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదన్నారు. అమరావతిని అమెరికా చేస్తామన్న బాబు ఇప్పటి వరకు ఒక్క పర్మినెంట్ భవనం నిర్మించ లేదన్నారు. బాబు వస్తే నిరుద్యోగులకు జాబు వస్తుంది అన్నారు కానీ ఆయన కొడుకు లోకేష్‌కు మాత్రమే మంత్రి పదవి వచ్చిందన్నారు. జయంతి వర్ధంతికి తేడా తెలియని లోకేష్ కు మూడు మంత్రి పదవులు ఇచ్చారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories