వైసీపీ గెలుపు ఖాయం.. ఫెడరల్ ఫ్రంట్లోకి జగన్..: కేటీఆర్

వైసీపీ గెలుపు ఖాయం.. ఫెడరల్ ఫ్రంట్లోకి జగన్..: కేటీఆర్
x
Highlights

పదహారు ఎంపీ సీట్లే లక్ష్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్ దూసుకెళ్తోంది. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సంపేటలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

పదహారు ఎంపీ సీట్లే లక్ష్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్ దూసుకెళ్తోంది. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సంపేటలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏపీ ఎన్నికల్లో గెలుపోటములపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఖచ్ఛితంగా వైసీపీ ఘనవిజయం ఖాయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఫెడరల్ ఫ్రంట్‌లోకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా మాతో పాటు వస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ దేశంలో కాంగ్రెస్, బీజేపీ అంటే పడనోళ్లు చాలామంది ఉన్నారని చెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయక్, మమతాబెనర్జీ, అఖిలేష్ యాదవ్ కలిస్తే మొత్తం 150 స్థానాలు అవుతాయన్నారు. వీరందరితోనూ ఫెడరల్ ఫ్రంట్‌తో కలిసి పనిచేస్తారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 16సీట్లు గెలిస్తే దిల్లీ గద్దెపై ఎవరు కూర్చోవాలో నిర్ణయించేది మనమే అవుతామని కేటీఆర్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories