ఒక్కో గ్రామ సచివాలయంలో పది మందికి ప్రభుత్వ ఉద్యోగం: జగన్

ఒక్కో గ్రామ సచివాలయంలో పది మందికి ప్రభుత్వ ఉద్యోగం: జగన్
x
Highlights

పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తామన్నారు వైఎస్ జగన్. ఈ గ్రామ సచివాలయాల్లో ఒక్కో గ్రామం నుంచి పది మందికి...

పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తామన్నారు వైఎస్ జగన్. ఈ గ్రామ సచివాలయాల్లో ఒక్కో గ్రామం నుంచి పది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వీటి ద్వారా అక్టోబర్ 2 నాటికి లక్షా 60 వేల ఉద్యోగాలు లభిస్తాయన్నారు.

సమస్య ఏదైనా ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగా ఫోన్ చేసి చెప్పేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ తెలిపారు. ఆగస్టు 15న ఈ కాల్ సెంటర్ అందుబాటులోకి వస్తుందన్నారు. అవినీతి జరిగిందని తెలిసినా ప్రభుత్వ పథకాలు అందలేకపోయినా, వివక్ష జరిగిందని భావించినా ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు జగన్.

Show Full Article
Print Article
Next Story
More Stories