సీఎం కేసీఆర్‌తో వైఎస్‌ జగన్‌ భేటి

సీఎం కేసీఆర్‌తో వైఎస్‌ జగన్‌ భేటి
x
Highlights

వైఎస్‌ జగన్‌ సతీసమేతంగా ప్రగతి భవన్‌‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌, టీఆర్‌‌ఎస్‌ మంత్రులు వైఎస్‌ జగన్‌...

వైఎస్‌ జగన్‌ సతీసమేతంగా ప్రగతి భవన్‌‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌, టీఆర్‌‌ఎస్‌ మంత్రులు వైఎస్‌ జగన్‌ దంపతులకు సాదరంగా ఆహ్వానం పలికారు. జగన్‌కు పుష్ప గుచ్చం సమర్పించి ఆలింగనం చేసుకుని అభినందలు తెలిపారు కేసీఆర్‌. అనంతరం కేటీఆర్‌ జగన్‌ దంపతులను లోపలికి తీసుకెళ్లారు. కుటుంబసభ్యులను పరిచయం చేసిన తర్వాత తెలంగాణ మంత్రులను జగన్‌కు పరిచయం చేశారు. జగన్‌ వెంట ప్రగతి భవన్‌కు వెళ్లిన వారిలో విజయసాయిరెడ్డి, బొత్స, మిధున్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories