జగన్ సభలో అపశృతి... కరెంట్ షాక్‌తో ఒకరు మృతి

జగన్ సభలో అపశృతి... కరెంట్ షాక్‌తో ఒకరు మృతి
x
Highlights

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వైఎస్ జగన్ నిర్వహించిన బహిరంగ సభలో అపశృతి చోటు చేసుకుంది. బహిరంగ సభ ముగిసిన తరువాత విద్యుత్ షాక్ తగిలి ఒకరు చనిపోగా 10...

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వైఎస్ జగన్ నిర్వహించిన బహిరంగ సభలో అపశృతి చోటు చేసుకుంది. బహిరంగ సభ ముగిసిన తరువాత విద్యుత్ షాక్ తగిలి ఒకరు చనిపోగా 10 మంది గాయపడ్డారు. మృతి చెందిన వ్యక్తి సోమిరెడ్డి ఆర్టీసీ కండక్టర్ . కరాలపాడుకు చెందిన చల్లా సోమిరెడ్డిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని గుంటూరుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పిడుగురాళ్లలోని ఐలాండ్ సెంటర్ లో బహిరంగ సభ నిర్వహించారు జగన్. అయితే ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం ముగించి వెళ్లగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా స్థానికంగా ఉన్న జ్యూస్ షాపు జనరైటర్ వైర్ కట్ చేసి వదిలివెళ్లడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories