జగన్‌ ఒక్క మాట చెబితే చాలు..

జగన్‌ ఒక్క మాట చెబితే చాలు..
x
Highlights

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని వైఎస్ భారతీరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో...

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని వైఎస్ భారతీరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో నిన్న (ఆదివారం) వైసీపీ అభ్యర్థి డా. మూలె సుధీర్‌రెడ్డితో కలిసి రోడ్‌షో, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ భారతి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి వైఎస్‌ పాటుపడతారని వైఎస్ భారతి హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగానే వైఎస్ భారతి ఇంటింటికీ తిరిగి ప్రజలతో మమేకమయ్యారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాము చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజల్లో భారీ స్పందన వస్తుదన్నారు. ఎన్నికల మేనిఫేస్టోలో భాగంగా వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టనున్న నవరత్నాలు పథకాల ద్వారా ప్రజలందరికీ తప్పకుండా మేలు జరుగుతుందన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి కూడా నేరవేర్చలేదన్నారు. జగన్‌ ఒక్క మాట చెబితే చాలు.. చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories