కడప జిల్లాలో వైసీపీ-టీడీపీ శ్రేణుల బాహాబాహీ..

కడప జిల్లాలో వైసీపీ-టీడీపీ శ్రేణుల బాహాబాహీ..
x
Highlights

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నువ్వా నేనా అని హోరాహోరీగా పోటీ సాగుతున్నాయి. కాగా ఏపీలోని కడప జిల్లాలో నేడు...

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నువ్వా నేనా అని హోరాహోరీగా పోటీ సాగుతున్నాయి. కాగా ఏపీలోని కడప జిల్లాలో నేడు వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లిలో వైసీపీ నేతలు అవినాశ్ రెడ్డి, సుధీర్ రెడ్డి రావాలి జగన్-కావాలి జగన్ అనే కార్యక్రమంలో వీరిద్దరు పాల్గోన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఆదినారాయణ రెడ్డి వర్గీయులు, టీడీపీ నేతలు కార్యక్రమం జరుగుతున్న ప్రదేశానికి చేరుకొని వైసీపీ నేతలను అడ్డుకున్నారు. ఇన్నాళ్లూగా పట్టించుకోకుండా కేవలం ఎన్నికల స్టంట్ కోసమే సున్నపురాళ్లపల్లికి వచ్చారని వైసీపీ నేతలను నిలదీశారు. ఇక దీంతో మాటా మాటా పెరిగి ఇరువర్గాలు ఘర్షణకు దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న అక్కడి పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చచెప్పి పరిస్థితిని అదుపులో్కి తెచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories