జగన్ జోరుకు కొట్టుకుపోయిన అధికార టీడీపీ...జిల్లాలకు జిల్లాలనే ఊడ్చేసిన...
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఫ్యాన్ దూసుకుపోయింది. జగన్ జోరుకు అధికార టీడీపీ...
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఫ్యాన్ దూసుకుపోయింది. జగన్ జోరుకు అధికార టీడీపీ కొట్టుకుపోయింది. జిల్లాలకు జిల్లాలనే వైసీపీ ఊడ్చేసింది. ఫ్యాన్ హోరుకి అధికార టీడీపీతోపాటు జనసేన, ఇతర పార్టీలు కొట్టుకుపోయాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఫ్యాన్ గాలి దెబ్బకు ప్రతి జిల్లాలోనూ ఒకట్రెండు సీట్లకే పరిమితమైంది టీడీపీ. ఎవ్వరూ ఊహించనివిధంగా రాష్ట్రం మొత్తం వైసీపీ ప్రభంజనం కొనసాగింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు వైసీపీ సత్తా చాటింది. టీడీపీ అత్యంత పట్టున్న జిల్లాల్లో సైతం ఘనవిజయం సాధించి వైసీపీ సంచలనం సృష్టించింది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలోనూ ఫ్యాన్ గాలి బలంగా వీచింది.
మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151 స్థానాలను కైవసం చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. తెలుగుదేశం పార్టీ కేవలం 24 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక మార్పు కోసమంటూ జనంలోకి వచ్చిన జనసేన ఒకే ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. అయితే జనసేనాని పవన్ కల్యాణ్ తాను పోటీచేసిన రెండు చోట్లా పరాజయం పాలయ్యారు. గాజువాకలో అయితే, పవన్ కల్యాణ్ దారుణంగా మూడో స్థానానికి పరిమితమయ్యారు.
లోక్సభ ఎన్నికల్లోనూ వైసీపీ సునామీ కొనసాగింది. మొత్తం 25 స్థానాల్లో 22 సీట్లను కైవసం చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంచలనం సృష్టించింది. ఇక టీడీపీ మూడు సీట్లలో గెలిచి పరువు నిలుపుకుంది. ఓవరాల్గా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఫ్యాన్ సునామీ సృష్టించింది. రాష్ట్రం మొత్తం జగన్ వేవ్ స్పష్టంగా కనిపించింది. ఫ్యాన్ సుడిగాలికి తెలుగుదేశం పార్టీ బేజారవగా మంత్రులు, హేమాహేమీలంతా కొట్టుకుపోయారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire