వర్మపై యామిని సాధినేని సంచలన వ్యాఖ్యలు..

వర్మపై యామిని సాధినేని సంచలన వ్యాఖ్యలు..
x
Highlights

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామిని సాధినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాంగోపాల్ వర్మ...

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామిని సాధినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాంగోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా 100 శాతం ఏపీలో విడుదల అవుతుందన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏపీలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో విజయవాడలో ప్రెస్‌మీట్‌ పెట్టేందుకు వెళ్లిన వర్మను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్‌కు పంపించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని మాట్లాడుతూ రాంగోపాల్ వర్మ ఓ సైకో డైరెక్టర్ అని వ్యాఖ్యానించారు. తను ఎంచేస్తాడో తనకైనా అర్థమవుతుందా అని ప్రశ్నించింది.

అసలు అలాంటి వ్యక్తికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఎన్నికల పోలింగ్ తరువాత రాష్ట్ర ప్రజల ఇబ్బందులపై వైసీపీ అధినేత జగన్ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు కానీ టాలీవుడ్ దర్శకుడు ఆర్జీవీ కోసం చేస్తారని విమర్శించారు. అసలు ఆర్జీవీకి ఎలా మద్దతుగా నిలుస్తారని ఆమె ఎద్దేవా చేశారు.వర్మకు మద్దతు పలుకుతూ వైఎస్ జగన్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తనపై ఎవరైనా విమర్శలు చేస్తే అదే రీతిలో ప్రతి విమర్శలు చేసే వర్మ మరీ యామిని వ్యాఖ్యాలకు ఎలా రియాక్టవుతారో చూడాలి మరి. రేపే ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories