సీట్ల సర్దుబాటుపై త్వరలోనే స్పష్టత..

సీట్ల సర్దుబాటుపై త్వరలోనే స్పష్టత..
x
Highlights

బెంగళూరులో కాంగ్రెస్,జేడీఎస్ కో ఆర్గినేషన్ కమిటి సమావేశం ఏర్పాటైన విషయం తెలిసిందే కాగా నేటి సాయంత్రానికి ఈ సమావేశం ముగిసింది. కాగా ఈ సమావేశానికి...

బెంగళూరులో కాంగ్రెస్,జేడీఎస్ కో ఆర్గినేషన్ కమిటి సమావేశం ఏర్పాటైన విషయం తెలిసిందే కాగా నేటి సాయంత్రానికి ఈ సమావేశం ముగిసింది. కాగా ఈ సమావేశానికి కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య, సీఎం హెచ్ డీ కుమారస్వామితోపాటు ఇతర పార్టీల నేతలు కూడా వచ్చారు. కాగా అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మాట్లాడుతూ రానున్న లోక్ సభ ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటుపై చర్చించినట్లు వెల్లడించారు. పరస్పర అవగాహన, సరైన ప్రణాళికతో తాము ఈ ఎన్నికల్లో ముందుకెళ్లనున్నట్లు తెలిపారు. త్వరలోనే సీట్ల సర్దుబాటుకు సంబంధించి తుది నిర్ణయం వెల్లడిస్తామని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories