ఎన్నికలకు ముందు సుప్రీం కోర్టు కీలక తీర్పు

ఎన్నికలకు ముందు సుప్రీం కోర్టు కీలక తీర్పు
x
Highlights

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీ ప్యాట్‌ల స్లిప్‌లు లెక్కించాలని...

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీ ప్యాట్‌ల స్లిప్‌లు లెక్కించాలని ఆదేశించింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 35 వీవీ ప్యాట్‌లు లెక్కించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 50శాతం వీవీ ప్యాట్లను లెక్కించాల్సిన అవసరం లేదన్న ఈసీ అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పటి వరకు ప్రతి అసెంబ్లీ స్థానానికి ఒక్క వీవీ ప్యాట్‌ స్లిప్పులను మాత్రమే లెక్కించే వారు. అయితే, ఈవీఎం ఓట్లతో పాటు వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలంటూ విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5, పార్లమెంట్ నియోజకవర్గంలో 35 వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించాల్సిందేనని స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories