గాలి మాకే అనుకూలం : ప్రధాని మోడీ

గాలి మాకే అనుకూలం : ప్రధాని మోడీ
x
Highlights

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో తమ ప్రభుత్వ అనుకూల గాలులు బలంగా వీస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుంటున్న ఓటర్లు, మహిళల...

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో తమ ప్రభుత్వ అనుకూల గాలులు బలంగా వీస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుంటున్న ఓటర్లు, మహిళల నాడిని పట్టుకోవడంలో రాజకీయ పండితులు విఫలమయ్యారని, ప్రతి రోజూ కొత్త కథలు అల్లుతున్నారంటూ విమర్శలు ఎక్కుపెట్టారు.

'రాజకీయ పండితులని చెప్పుకుంటున్న వారు ఢిల్లీలో కూర్చుని మోదీ సర్కార్‌కు అనుకూలంగా ఎలాంటి గాలులు లేవని ప్రతిరోజూ కొత్త కథలు అల్లుతున్నారు. తొలిసారి ఓటు హక్కు పొందిన వారు, మహిళలు నాకు మద్దతిస్తున్న విషయం వారికి తెలియదు. అత్యాచారాలకు పాల్పడిన వారికి మరణశిక్ష విధిస్తూ చట్టం తీసుకువచ్చినందుకు తల్లులు, సోదరీమణులంతా నాకు సపోర్ట్ చేస్తున్నారు' అని మధ్యప్రదేశ్‌లోని రట్లాంలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ చెప్పారు. మహిళల గృహాలకే నేరుగా వంటగ్యాస్, విద్యుత్ అందజేశామని, టాయిలెట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రభుత్వ అనుకూల గాలులు ఎక్కడ్నించి వస్తున్నాయో తెలియక రాజకీయ పండితులు తలలు పట్టుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత, భోపాల్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ ఓటు వేయకపోవడంపై మోదీ మాట్లాడుతూ, తొలిసారి ఓటు వేస్తున్న వారికి ఇది తప్పుడు ఉదాహరణ అవుతుందని అన్నారు. తొలిసారి ఓటు హక్కు పొందిన వారు తమ మొబైల్స్‌లోనే అందరి నాయకులను గమనిస్తున్నారని, ఎవరికి ఓటు వెయ్యాలో వారికి చెప్పాల్సిన పని లేదని, వారు అభివృద్ధికే ఓటు వేస్తారని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories