బతుకుదెరువు కోసం వెళ్లి మలేషియా చిక్కుకున్న విశాఖ యువకులు..

బతుకుదెరువు కోసం వెళ్లి  మలేషియా చిక్కుకున్న విశాఖ యువకులు..
x
Highlights

ఉపాధి కోసం మలేషియా వెళ్లిన విశాఖ జిల్లా యువకులు ఏజెంట్ మోసంతో అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెంట్ మోసానికి టూరిస్ట్ వీసాపై మలేషియా వెళ్లి...

ఉపాధి కోసం మలేషియా వెళ్లిన విశాఖ జిల్లా యువకులు ఏజెంట్ మోసంతో అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెంట్ మోసానికి టూరిస్ట్ వీసాపై మలేషియా వెళ్లి చిక్కుకుపోయారు నలుగురు విశాఖ జిల్లా యువకులు. తాము పడుతున్న కష్టాలను వారు సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశారు. 2018 ఆగస్టు 12న బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామానికి చెందిన వెంకునాయుడు, మహేష్, గిరీష్, శ్రీనివాసులు మలేషియా వెళ్లారు. ఇందుకోసం ఏజెంట్‌కు వారు ఒక్కొక్కరు 60 వేల రూపాయలు చెల్లించారు. అయితే అక్కడకు వెళ్లాక వారు వచ్చింది టూరిస్ట్ వీసా అని తెలుసుకుని నిర్ఘాంతపోయారు. తమ పాస్ పోర్టు చింపేశారని, తమను ఓ గదిలో నిర్బంధించారని యువకులు అంటున్నారు. మరోవైపు తమ పిల్లల కోసం తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మలేసియాలో చిక్కుకున్న యువకులను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు అధికారులను వేడుకుంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories