అసెంబ్లీ సాక్షిగా మంత్రి, ఎమ్మెల్యే మాటల యుద్ధం

అసెంబ్లీ సాక్షిగా మంత్రి, ఎమ్మెల్యే మాటల యుద్ధం
x
Highlights

అసెంబ్లీ సమావేశంలో అచ్చెన్నాయుడు విష్ణుకుమార్ రాజు మధ్య మాటల యుద్ధం జరిగింది. పార్టీ, ప్రభుత్వ నిర్ణయాలపై ఇద్దరు నేతల మధ్య తీవ్రవాగ్వివాదం జరిగింది. ...

అసెంబ్లీ సమావేశంలో అచ్చెన్నాయుడు విష్ణుకుమార్ రాజు మధ్య మాటల యుద్ధం జరిగింది. పార్టీ, ప్రభుత్వ నిర్ణయాలపై ఇద్దరు నేతల మధ్య తీవ్రవాగ్వివాదం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీకి ఎందుకు రాజీనామా చేశారో సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ మీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ఎందుకు రాజీనామా చేశారో చెబితే ఆకుల గురించి నేనూ చెబుతానని విష్ణుకుమార్ రాజు కౌంటర్ వేశారు. తన ప్రసంగాన్ని రాజు కొనసాగిస్తూ కేవలం ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే సరిపోదని, పార్టీ ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలను ఎందుకు బయటకు పంపడం లేదని ప్రజలు అడుగుతున్నారని అన్నారు.'ఏపీ అభివృద్ధికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో మంత్రి యనమల రామకృష్ణుడుకు తెలుసు. అందుకే ఆయన నల్ల చొక్కా ధరించలేదు' అని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories