కేసీఆర్‌ మాటలు.. బ్రహ్మానందం కామెడీ..

కేసీఆర్‌ మాటలు.. బ్రహ్మానందం కామెడీ..
x
Highlights

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీనే తెలంగాణలో లేకుండా చేయడానికి సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని విజయశాంతి మండిపడ్డారు. మెదక్‌లో సోమవారం నిర్వహించిన...

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీనే తెలంగాణలో లేకుండా చేయడానికి సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని విజయశాంతి మండిపడ్డారు. మెదక్‌లో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్‌ సింహగర్జన ఎన్నికల ప్రచార సభలో విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ కేసీఆర్ పై విరుచుకపడింది. కేసీఆర్ మాట్లాడితే 16 సీట్లు అంటూ జపం చేస్తున్నారని విజయశాంతి విమర్శించారు. గత2014, 2018లో ముఖ్యమంత్రి రాగం తీశారని, ఆయన్ను ముఖ్యమంత్రి చేశారన్నారు. 2019లో తనకు 16 సీట్లు ఇవ్వండని ప్రధాని అవుతానంటున్నారని, కేసీఆర్ మాటలు చూస్తుంటే బ్రహ్మానందం, ఆలీ కామెడీలా అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. మరి అదే గతంతో కూడా 16 మంది ఎంపీలున్నా విభజన హామీలు సాధించలేకపోయారని ధ్వజమెత్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories