పాపం బీజేపి నాయకులను చూస్తుంటే జాలేస్తుంది .. విజయశాంతి

పాపం బీజేపి నాయకులను చూస్తుంటే జాలేస్తుంది .. విజయశాంతి
x
Highlights

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి జాతీయ మీడియా వెల్లడించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను చూస్తూ ఉంటే ఇవి కేవలం ప్రధాని నరేంద్ర మోడీని సంతృప్తిపరచడానికే ఈ...

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి జాతీయ మీడియా వెల్లడించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను చూస్తూ ఉంటే ఇవి కేవలం ప్రధాని నరేంద్ర మోడీని సంతృప్తిపరచడానికే ఈ రకమైన ఫలితాలు వెల్లడించినట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తూ ఉంటే 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభంజనం వీచిందని అందరూ చెప్పుకున్న తరుణంలో కూడా బీజేపీకి ఇంత అనుకూల పరిస్థితి కనిపించలేదు.

ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తూ ఉంటే... ఒకదానికొకటి పొంతన కుదరట్లేదు. నిజంగా ఈసారి ఎన్నికల్లో కూడా మోడీ ప్రభంజనం వీచే పరిస్థితి ఉంటే స్వయంగా మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి సీట్లు ఎందుకు తగ్గుతున్నాయి. మరి దీన్ని బట్టి చూస్తుంటే బిజెపి మీద ఉత్తరప్రదేశ్ ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది అనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లోని ప్రజలను మోడీ సంతృప్తి పరచలేనప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా మోడీకి అనుకూలంగా ఓటు వేశారని ఎలా భావించగలం?

ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తూ ఉంటే ఇటీవల జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ , చత్తీస్గడ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయాలను కూడా పరిగణలోకి తీసుకోకూడదు. ఎందుకంటే ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపి క్లీన్ స్వీప్ చేస్తే తప్ప ఎగ్జిట్ పోల్ లో పేర్కొన్న విధంగా 295 నుంచి 305 సీట్లు వచ్చే అవకాశం లేదు. నిజంగా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వాస్తవమే అయితే గత నాలుగు నెలల కాలంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ , ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ చేసిన తప్పులు ఏమిటి? ఈ మూడు రాష్ట్రాల ప్రజలకు మోడీ ఇచ్చిన వరాలు ఏమిటి ?మరో నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రజలు మోడీకి వ్యతిరేకంగా ఏ రకమైన తీర్పును ఇవ్వబోతున్నారనే విషయం వెల్లడి కానున్న తరుణంలో చివరిగా ఎగ్జిట్ పోల్స్ పేరుతో ఈ రకమైన ఆనందాన్ని పొందుతునందుకు బిజెపి నేతలను చూసి జాలి పాడటం తప్ప మరేమీ చేయలేము.


Show Full Article
Print Article
Next Story
More Stories