కేంద్ర ఎన్నికల సంఘానికి విజయసాయిరెడ్డి లేఖ

కేంద్ర ఎన్నికల సంఘానికి విజయసాయిరెడ్డి లేఖ
x
Highlights

కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. కౌంటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించేందుకు టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు....

కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. కౌంటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించేందుకు టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి టీడీపీ కార్యకర్తలు నకిలీ ఫాం 17లతో వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ లేఖలో తెలియజేశారు. నకిలీ ఫాం 17లతో వచ్చే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కోరారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని కోరారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలని కోరారు. వైసీపీ పార్టీ కౌంటింగ్‌ ఏజెంట్లకు ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు సృష్టించి ఆలస్యం చేసే కుట్రపన్నుతున్నారని ఈసీకి నివేదించారు. ఈవీఎంల వద్ద మెష్‌తో పాటు స్టీల్‌ బారికేడ్లు కూడా ఏర్పాటు చేయాలని కోరారు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత ఈసీపైనే ఉందని లేఖలో విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.





Show Full Article
Print Article
Next Story
More Stories