చంద్రబాబు లేఖపై విజయసాయి రెడ్డి ఏమన్నారంటే..

చంద్రబాబు లేఖపై విజయసాయి రెడ్డి ఏమన్నారంటే..
x
Highlights

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు లేఖపై వైఎస్సార్ సీపీ ఎంపీ...

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు లేఖపై వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. సీఎం జగన్‌కు చంద్రబాబు రాసే మొదటి లేఖ ప్రజా సమస్యలపై ఉంటుందని భావిస్తే, అమరావతిలోని విలాస భవనంపై చంద్రబాబుకు చింత పట్టుకుందని ఎద్దేవా చేశారు. ప్రపంచం మొత్తాన్ని అమరావతికి రప్పిస్తానని అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేదా అని చంద్రబాబుకు విజయసాయి రెడ్డి చురకలు అంటించారు. అలాగే టెండర్లలో అవినీతికి ఆస్కారం లేకుండా సిట్టింగ్‌ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు సాహసోపేత నిర్ణయమని విజయసాయి రెడ్డి అభివర్ణించారు. కొన్ని సందర్భాల్లో విశ్రాంత న్యాయమూర్తులతో విచారణ చేయించడం చూశామని, ఇప్పుడు నిరంతరం స్క్రూటినీ ఉంటుందన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories