ఏపీ సీఎస్‌కు విజయసాయిరెడ్డి లేఖ

ఏపీ సీఎస్‌కు విజయసాయిరెడ్డి లేఖ
x
Highlights

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాశారు. నిపుణుల అభిప్రాయం తీసుకోకుండా ఇజ్రాయెల్‌ కంపెనీ...

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాశారు. నిపుణుల అభిప్రాయం తీసుకోకుండా ఇజ్రాయెల్‌ కంపెనీ నుంచి సాఫ్ట్‌వేర్‌ తీసుకునేందుకు టీడీపీ ప్రభుత్వ అంగీకరించిందని విజయసాయి రెడ్డి లేఖలో పేర్కొన్నారు. కాగా ప్రతిపక్ష పార్టీ నేతలు, వారి అనుచరులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల ఫోన్ల ట్యాపింగ్‌కు ఇజ్రాయెల్‌ కంపెనీ సాఫ్ట్‌వేర్‌, పరికరాలను ఉపయోగిస్తున్నట్లు లేఖలో తెలియజేశారు. అయితే ఈ పరికరాల కొనుగోలు వెనక ఉన్న దురుద్దేశం బహిర్గతం కావాల్సి ఉందని, అందుకనే ఇజ్రాయెల్‌ కంపెనీకి చెల్లించాల్సిన రూ.12.5 కోట్ల బిల్లును నిలిపి వేయాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories