నువ్వు మారవు బాబూ..

నువ్వు మారవు బాబూ..
x
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ తన ప్రమాణస్వీకారానికి చంద్రబాబును హుందాగా...

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ తన ప్రమాణస్వీకారానికి చంద్రబాబును హుందాగా ఆహ్వానించారనీ, కానీ చంద్రబాబు మాత్రం దానికి వేరే స్టోరీ అల్లి మీడియాలో రాయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ట్వీటర్‌ వేదికగా చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ప్రమాణ స్వీకారానికి జగన్ గారు హుందాగా ఆహ్వానిస్తే దానికి వేరే స్టోరీ అల్లి మీడియాలో రాయించుకుంటావా? మీ సలహాలు అవసరం, మీరు అనువజ్ణులు అని, ఆయన అనని మాటలు పుట్టిస్తారా? మీ అనుభవం దోచుకోవడానికి మాత్రమే ఉపయోగించావని గ్రహించే యువనేతకు పట్టం కట్టారు ప్రజలు. నువ్వు మారవు బాబూ' అని ఆయన ట్వీట్ చేశారు.

'జగన్ గారు అత్యున్నత సంప్రదాయాన్ని పాటించి స్థానిక/జాతీయ నేతలు, ఇతర రాష్ట్రాల సిఎంలను ఫోన్ ద్వారా ఆహ్వానించే సమయంలో నేను పక్కనే ఉన్నా. మీకూ నా ముందే ఫోన్ చేసారు. కానీ ఆయన మీ అనుభవం, సలహాలు అవసరం అనే మాటలే వాడలేదు. ఆయన అనని మాటల్ని అన్నట్టు ప్రచారం చేసుకునేంత నీచానికి దిగారు.' అని విజయసాయి రెడ్డి మరో ట్వీట్ చేశారు.

'దేనిలో అనుభవజ్ణుడివి చంద్రబాబూ? కుట్ర, కుతంత్రాలు, వెన్నుపోటు, నయవంచన, ప్రజాధనాన్ని లూటీ చేయడంలో తప్ప మీకు ఎందులో అనుభవం ఉంది బాబూ. చిత్తుగా ఓడిన తర్వాత కూడా అబద్ధాలతో ఆత్మవంచన చేసుకుంటున్నావు. మీ సలహా విన్న వారంతా ఏమయ్యారో తెలిసి కూడా మిమ్మల్ని అడుగుతారా బాబూ? మీ పిచ్చిగాని' అని విజయసాయి రెడ్డి మరో ట్వీట్ చేశారు.




Show Full Article
Print Article
Next Story
More Stories