ఆ సీనుంటే నాలుగు సర్వేలెందుకు? బాబుకి విజయసాయి రెడ్డి కౌంటర్

ఆ సీనుంటే నాలుగు సర్వేలెందుకు? బాబుకి విజయసాయి రెడ్డి కౌంటర్
x
Highlights

ఏపీలో మరోసారి టీడీపీయే అధికారంలోకి వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ తర్వాత నాలుగు రకాల సర్వేలు చేయించామన్న బాబు అన్నింటిలోనూ టీడీపీ...

ఏపీలో మరోసారి టీడీపీయే అధికారంలోకి వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ తర్వాత నాలుగు రకాల సర్వేలు చేయించామన్న బాబు అన్నింటిలోనూ టీడీపీ గెలుపు ఖాయమని వచ్చిందన్నా విషయం తెలిసిందే. కాగా చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం ట్విటర్‌ వేదికగా ఘాటుగా స్పందించారు. అసలు ఏపీ ఎన్నికల్లో టీడీపీ గెలిచే సీనుంటే బాబు నాలుగు రకాల సర్వేలెందుకు చేయించారని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఆ సర్వే వివరాలు బయటపెట్టి కనీసం ఏజెంట్లకైనా కాస్తా ధైర్యం నూరిపోయంటంని విజయసాయిరెడ్డి సూచించారు. ఎన్నికలు ఐదేళ్లకొకసారి మాత్రమే వస్తాయని, కానీ పార్టీలు శాశ్వతంగా ఉంటాయని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories