జగన్ నవ్వితే.. బాబు ఏడుస్తున్నారు: వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

జగన్ నవ్వితే.. బాబు ఏడుస్తున్నారు: వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మరోసారి విమర్శలు గుప్పించారు వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల తీర్పు అర్ధమయ్యే...

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మరోసారి విమర్శలు గుప్పించారు వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల తీర్పు అర్ధమయ్యే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని వాసిరెడ్డి పద్మ అన్నారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ ఫొని తుపానును జాగ్రత్తగా చంద్రబాబే పక్కకు తప్పించాని అనడం విడ్డురంగా ఉందని అన్నారు. అసలు గడిచిన ఐదేండ్లలో నారా చంద్రబాబు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఏం సాధించారని ఆమె ప్రశ్నించారు. ఐదేళ్లలో ఒక్క కేబినెట్ మీటింగ్ అయినా భూ కేటాయింపులు లేకుండా జరిగిందా అని ప్రశ్నించారు.

ఇక ఇప్పుడు మంత్రివర్గ సమావేశం పెట్టి ఎవరిని పిలుస్తారంటూ ప్రశ్నించారు. నేడు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఏ నిర్ణయాలు తీసుకుంటారో చెప్పాలని పద్మ డిమాండ్‌ చేశారు. ఐదేండ్లుగా అవినీతి, అరాచకాలు చేసి ఇప్పుడు నారా చంద్రబాబు మాట్లాడుతున్న తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ నవ్వితే చంద్రబాబు ఏడుస్తున్నారన్నారు. మొన్న జగన్ సినీమాకు వెళ్లినా దానిని కూడా రాజకీయం చేస్తున్నరని మండిపడ్డారు. కనీసం ఆయనకు సినిమాకు వెళ్లే హక్కు కూడా లేదా. టీటీడీ బంగారం వ్యవహారంపై స్పందించని బాబు జగన్‌ సినిమాకు వెళ్తే మాత్రం మాట్లాడతారు. నారా లోకేష్ ఎక్కడున్నారో చెప్పండి.

Show Full Article
Print Article
Next Story
More Stories