సస్పెన్స్‌కు తెరదించిన వంగవీటి రాథాకృష్ణ

సస్పెన్స్‌కు తెరదించిన వంగవీటి రాథాకృష్ణ
x
Highlights

వంగవీటి రాథాకృష్ణ సస్పెన్స్‌కు తెరదించారు. టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇవాళ సాయంత్రం చంద్రబాబు సమక్షంలో పసుపు గడప తొక్కబోతున్నారు. వ్యక్తిగత...

వంగవీటి రాథాకృష్ణ సస్పెన్స్‌కు తెరదించారు. టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇవాళ సాయంత్రం చంద్రబాబు సమక్షంలో పసుపు గడప తొక్కబోతున్నారు. వ్యక్తిగత ప్రతిష్ట గురించి కాకుండా పేదల కోసం నిందలు మోయడానికి సిద్ధపడి అడుగులేస్తున్నానని వంగవీటి రాధాకృష్ణ చెబుతున్నారు.

వంగవీటి రాధాకృష్ణ వైసీపీని వీడటంతోనే టీడీపీలో చేరతారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఆయన ఎటూ తేల్చకుండా మౌనం దాల్చడంతో రంగా అభిమానుల్లో కొంతకాలంగా అయోమయం నెలకొంది. ఆయన టీడీపీలో చేరే అంశంపై ఇంత కాలానికి స్పష్టత వచ్చింది. వంగవీటి రాధాకృష్ణ ఇవాళ సాయంత్రం 4 గంటలకు తెలుగుదేశంలో చేరుతున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారు.

సోమవారం రాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో కలిసి చంద్రబాబుతో భేటీ అయిన రాధా నిన్న మధ్యాహ్నం మరోసారి సీఎంతో సమావేశమయ్యారు. అప్పుడే టీడీపీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నందుకు రాధా ధన్యవాదాలు చెప్పారు. తన తండ్రి వంగవీటి రంగా ఆకాంక్షను సీఎం నెరవేర్చారని, అందుకే టీడీపీ తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. నియంతృత్వ స్వభావం ఉన్న వ్యక్తి చేతుల్లోకి అధికారం వెళ్లకూడదన్న ఉద్దేశంతో టీడీపీలో చేరతున్నట్లు జగన్‌ను ఉద్దేశించి రాధా పరోక్ష విమర్శ చేశారు.

టీడీపీలో చేరుతున్న రాధాకి మద్దతిచ్చేది లేదని రాధారంగా మిత్రమండలి తేల్చి చెప్పింది. రంగాని చంపడంలో టీడీపీ పాత్రలేదని రాధా చెప్పడం బాధాకరమన్న రాధారంగా మిత్రమండలి రాధా ఎక్కడ నుంచి పోటి చేసినా ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామంటోంది. అయితే టీడీపీ మాత్రం వంగవీటి రాధాకృష్ణ చేరికతో కాపు సామాజిక వర్గ మద్దతు మరింత పెరుగుతుందని లెక్కలు వేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories